Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:33 PM

ప్రజలే కుటుంబం.. బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: కందాళ ఉపేందర్ రెడ్డి

ప్రజలే కుటుంబం.. బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: కందాళ ఉపేందర్ రెడ్డి

ప్రజలే కుటుంబం.. బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: కందాళ ఉపేందర్ రెడ్డి
December 28, 2025 06:58 PM 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన సర్పంచులను అభినందించిన కందాళ ఉపేందర్ రెడ్డి

ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులను అభినందించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు అధైర్యపడకుండా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని భవిష్యత్‌కు సిద్ధం కావాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో భాగస్వాములుగా నిలవాలని పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలనే కుటుంబంగా భావించి పనిచేస్తున్నానని పేర్కొన్నారు.

నేటి రాజకీయాల్లో ప్రజలను దుర్భాషలాడటం సరికాదని, ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎందుకు తిట్లు తినాలనే అంశంపై నాయకులు ఆలోచించాలని సూచించారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందన్నారు.

రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News