Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:59 AM

ప్రజలే కుటుంబం.. బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: కందాళ ఉపేందర్ రెడ్డి

ప్రజలే కుటుంబం.. బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: కందాళ ఉపేందర్ రెడ్డి

ప్రజలే కుటుంబం.. బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: కందాళ ఉపేందర్ రెడ్డి
December 28, 2025 06:58 PM 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన సర్పంచులను అభినందించిన కందాళ ఉపేందర్ రెడ్డి

ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులను అభినందించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు అధైర్యపడకుండా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని భవిష్యత్‌కు సిద్ధం కావాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో భాగస్వాములుగా నిలవాలని పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలనే కుటుంబంగా భావించి పనిచేస్తున్నానని పేర్కొన్నారు.

నేటి రాజకీయాల్లో ప్రజలను దుర్భాషలాడటం సరికాదని, ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎందుకు తిట్లు తినాలనే అంశంపై నాయకులు ఆలోచించాలని సూచించారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందన్నారు.

రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News