ప్రజలే కుటుంబం.. బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: కందాళ ఉపేందర్ రెడ్డి
ప్రజలే కుటుంబం.. బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: కందాళ ఉపేందర్ రెడ్డి
Editor Desk
నూతన సర్పంచులను అభినందించిన కందాళ ఉపేందర్ రెడ్డి
ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులను అభినందించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు అధైర్యపడకుండా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని భవిష్యత్కు సిద్ధం కావాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో భాగస్వాములుగా నిలవాలని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలనే కుటుంబంగా భావించి పనిచేస్తున్నానని పేర్కొన్నారు.
నేటి రాజకీయాల్లో ప్రజలను దుర్భాషలాడటం సరికాదని, ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎందుకు తిట్లు తినాలనే అంశంపై నాయకులు ఆలోచించాలని సూచించారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందన్నారు.
రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి