Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 05:12 PM

ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఖేడ్ ఎమ్మెల్యే సమీక్ష

ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఖేడ్ ఎమ్మెల్యే సమీక్ష

ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఖేడ్ ఎమ్మెల్యే సమీక్ష
April 09, 2026 03:17 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలోని బసవ ప్రదీప్ కళ్యాణ మండపంలో నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ మరియు తాగునీటి సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గాలను సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఎమ్మెల్యే స్వయంగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను వినడం మాత్రమే కాకుండా, సంబంధిత అధికారులను కూడా వెంట తీసుకెళ్లి అక్కడికక్కడే సమస్యలను నమోదు చేయించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, దీంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది.వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ, లో-వోల్టేజ్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని సూచించారు. రైతులకు సాగునీటి అవసరాలకు అనుగుణంగా సరిపడా విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తాగునీరు సమృద్ధిగా అందేలా చూడాలని, పైపులైన్లలో లీకేజీలను వెంటనే అరికట్టి మరమ్మతులు చేయాలని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు మెరుగైన సేవలు అందించడమేనని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖకు చెందిన అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News