ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా,పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ స్వయంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.
ప్రజలు అందించిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరిధిలో న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
ప్రతి ఫిర్యాదుదారునికి న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విచ్చేసిన వికలాంగులు తమ సమస్యలను తెలియజేయడానికి వచ్చిన విషయం గమనించిన జిల్లా ఎస్పీ స్వయంగా వారి వద్దకు వెళ్లి, వారి సమస్యలను ఓపికగా విన్నారు. వారి ఇబ్బందులను తెలుసుకుని, వెంటనే పరిష్కార దిశగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, మహిళలు వంటి సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని, అందిన ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలించి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ పనిచేస్తుందని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి