ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి సవితమ్మ
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి సవితమ్మ
Anjali
పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవిత ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, భూ, పెన్షన్, రేషన్, గృహ నిర్మాణం, విద్యుత్, తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.ప్రతి ఒక్కరి సమస్యను విన్న మంత్రి సవిత సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి