ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న:ఖేఢ్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న:ఖేఢ్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్, 2వ వార్డు సభ్యురాలు సురేఖ, 6వ వార్డు సభ్యుడు లక్ష్మణ్, 13వ వార్డు సభ్యుడు వివేకానంద మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వార్డులో రహదారుల దుస్థితి, మురికి కాలువలు, కాలువల వ్యవస్థలో లోపాలు వంటి సమస్యలను స్వయంగా పరిశీలించిన చైర్మన్, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కాలువల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, దెబ్బతిన్న రహదారులను మరమ్మత్తు చేయాలని సూచించారు. అలాగే విద్యుత్ సమస్యలపై విద్యుత్ శాఖ సహాయ ఇంజనీరు నారాయణతో మాట్లాడి తక్కువ విద్యుత్ ఒత్తిడి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చామకురా పాండు, మైపాల్ రెడ్డి, జీవన్ శేట్, విట్టల్ తదితరులు కూడా పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి