నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గజ్జెల కాంతం కలిసి ఈ రోజు మున్సిపల్ పట్టణంలోని 9వ మరియు 5వ వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో 9వ వార్డు అభ్యర్థి బాణాపురం రాజు,5వ వార్డు అభ్యర్థి కర్ర మహేష్కు మద్దతుగా గడప గడపకు వెళ్లి ప్రజలను కలిశారు.ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి,వాటికి త్వరితగతిన పరిష్కారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ పాలనలో పారదర్శకత,జవాబుదారీతనం ఉండాలని, ప్రజలకు అవసరమైన సేవలు నేరుగా అందే విధంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.ఇది ప్రజల్లో మంచి స్పందనను కలిగించింది.మున్సిపల్ ఎన్నికల అనంతరం 9వ మరియు 5వ వార్డుల్లో రోడ్ల అభివృద్ధి,శుద్ధ తాగునీటి సరఫరా,సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు.అలాగే పేదలకు ఇళ్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఇవన్నీ పట్టణాన్ని అభివృద్ధి దిశగా నడిపించే చర్యలని చెప్పారు.గత పది సంవత్సరాలుగా డ్రైనేజీ నీరు తాగునీటిలో కలవడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించారు. ఈ దీర్ఘకాలిక సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
ప్రజల మద్దతుతో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్థులు
ప్రజల మద్దతుతో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్థులు
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గజ్జెల కాంతం కలిసి ఈ రోజు మున్సిపల్ పట్టణంలోని 9వ మరియు 5వ వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో 9వ వార్డు అభ్యర్థి బాణాపురం రాజు,5వ వార్డు అభ్యర్థి కర్ర మహేష్కు మద్దతుగా గడప గడపకు వెళ్లి ప్రజలను కలిశారు.ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి,వాటికి త్వరితగతిన పరిష్కారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ పాలనలో పారదర్శకత,జవాబుదారీతనం ఉండాలని, ప్రజలకు అవసరమైన సేవలు నేరుగా అందే విధంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.ఇది ప్రజల్లో మంచి స్పందనను కలిగించింది.మున్సిపల్ ఎన్నికల అనంతరం 9వ మరియు 5వ వార్డుల్లో రోడ్ల అభివృద్ధి,శుద్ధ తాగునీటి సరఫరా,సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు.అలాగే పేదలకు ఇళ్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఇవన్నీ పట్టణాన్ని అభివృద్ధి దిశగా నడిపించే చర్యలని చెప్పారు.గత పది సంవత్సరాలుగా డ్రైనేజీ నీరు తాగునీటిలో కలవడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించారు. ఈ దీర్ఘకాలిక సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి