Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో హోటళ్లదే ప్రధాన పాత్ర

ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో హోటళ్లదే ప్రధాన పాత్ర

ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో హోటళ్లదే ప్రధాన పాత్ర
February 13, 2026 06:38 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కామేపల్లి మండలంలో నూతన దాబా హోటల్ ప్రారంభం – మేకల మల్లిబాబు యాదవ్ అభిప్రాయం

కామేపల్లి: సమాజంలో యాంత్రిక జీవనం పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి మారిపోయిందని, వారి కనీస అవసరాలు తీర్చడంలో హోటళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు.మండలంలోని పండితాపురం గ్రామంలో పశువుల సంత ఎదుట గ్రామ ఉపసర్పంచ్ మేకల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శుక్రవారం నూతన దాబా హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మహమ్మద్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ధనియాకుల హనుమంతరావు, గ్రామ సర్పంచ్ ధరావత్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ మానవ జీవనం నానాటికీ దశలవారీగా మారిపోతుందని తెలిపారు. గతంలో యంత్రాలు, ట్రాక్టర్లు లేని కాలంలో గ్రామాల్లో పాడి అభివృద్ధి చెందిందని, స్వచ్ఛమైన పాలు లభించేవని అన్నారు. ఉదయం ఇంటివద్ద టీ తాగి వెళ్లినవారు మళ్లీ టీ గురించి ఆలోచించేవారు కాదని పేర్కొన్నారు. కానీ నేడు వ్యాపారాభివృద్ధి, పనుల ఒత్తిడి కారణంగా ప్రజలు రోజులో అనేకసార్లు టీ త్రాగే అలవాటు చేసుకున్నారని అన్నారు.

ఇంటి వద్ద వంట చేసుకునే సమయం లేకపోవడం వల్ల బయట ఆహారం తీసుకునే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి అవసరాలను తీర్చేందుకు హోటళ్లు అవసరమయ్యాయని తెలిపారు. నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తే హోటల్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, హోటల్ యజమాని మేకల లక్ష్మీనారాయణ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తోటకూరి శివయ్య, షేక్ రబ్బానీ పాషా, ధరావతులాల భూక్య నాగేంద్రబాబు, నల్లమోతు లక్ష్మయ్య, జన్నారపు లింగయ్య, జక్కంపూడి వెంకటేశ్వర్లు, బండి ఉపేందర్, తోటకూరి భద్రయ్య, చాకలి రాములు, డేరంగుల తిరపయ్య, రాయల నాగ శంకర్, పాటిబండ్ల ప్రసాదు, బాదావత్ నాగరాజు, బండి ఎల్లయ్య, బత్తల సంగయ్య, మేకల మహేష్ బాబు, గుగులోతు రవి, అంబడిపూడి వెంకటయ్య, ఉన్నం ప్రభాకర్, చింతల వెంకయ్య, పల్లె వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News