Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:37 AM

ప్రజల ఆరోగ్యంపై రైస్ మిల్‌ ముప్పు తక్షణమే తొలగించాలి – నవజీవన్ రెడ్డి

ప్రజల ఆరోగ్యంపై రైస్ మిల్‌ ముప్పు తక్షణమే తొలగించాలి – నవజీవన్ రెడ్డి

ప్రజల ఆరోగ్యంపై రైస్ మిల్‌ ముప్పు తక్షణమే తొలగించాలి – నవజీవన్ రెడ్డి
February 08, 2026 04:52 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నివాస ప్రాంతంలో రైస్ మిల్‌ ముప్పు తక్షణమే తొలగించాలి – కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

హయత్ నగర్: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శివాజీ కాలనీలో కొనసాగుతున్న రైస్ మిల్ ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదంగా మారిందని స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మిల్‌ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి, శబ్ద కాలుష్యం, వ్యర్థాల కారణంగా కాలనీ మొత్తం కాలుష్య బారిన పడుతోందని, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు తదితర అనారోగ్యాలతో బాధపడుతున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో శివాజీతో పాటు పరిసర కాలనీల ప్రజలతో కలిసి కార్పొరేటర్ రైస్ మిల్ వద్దకు వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి యాజమాన్యంపై నిరసన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమను నడపడం చట్ట విరుద్ధమే కాక ప్రజల ప్రాణాలకు ముప్పు అని అన్నారు. మిల్‌ను తరలించాలని గతంలో పలుమార్లు సూచించినా ప్రతి సారి గడువు పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.సంబంధిత శాఖలకు లిఖితపూర్వకంగా వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని, ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సహించబోమని స్పష్టం చేశారు. వెంటనే రైస్ మిల్‌ను తరలించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మిథిలా నగర్ అధ్యక్షులు గంటా శ్రీధర్ రెడ్డి, బృందావన్ హోమ్స్ అధ్యక్షులు సత్తు నాగయ్య, శివాజీ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్, బ్లోసమ్ సిటీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, లక్ష్మీగణపతి కాలనీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి, దుర్గానగర్ అధ్యక్షులు బీరప్ప, లక్ష్మీప్రియా కాలనీ అధ్యక్షులు మధు, పీ అండ్ టీ కాలనీ అధ్యక్షులు పూర్ణయ్యతో పాటు వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.







మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News