Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను అభినందించిన కౌన్సిలర్ మమత రాజు బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 06:56 PM

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కమ్యూనిస్టులు

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కమ్యూనిస్టులు

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కమ్యూనిస్టులు
May 02, 2026 05:27 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బైకాని నరసింహ స్మారక స్థూపావిష్కరణ, సంతాప సభకు భారీ స్పందన

ప్రజా శ్రేయస్సు కోసం పోరాడిన కమ్యూనిస్టులు మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. గ్రామంలోని సీపీఎం సీనియర్ నాయకుడు బైకాని నరసింహ స్మారక స్థూపావిష్కరణ, సంతాప సభ గ్రామపంచాయతీ కేంద్రంలో ఘనంగా జరిగింది.

స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే ప్రజా పోరాటాల్లో మమేకమైన నరసింహ గ్రామ ప్రజల మనసుల్లో చెదరని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఆయన మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.

ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపుతూ ధరలను పెంచుతున్నాయని, పేదల జీవన పరిస్థితులు దెబ్బతింటున్నాయని విమర్శించారు. ఎన్నికలను పెట్టుబడిగా మార్చి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పేదలకు నాణ్యమైన వైద్యం అందాలి

ఎం.డి. జహంగీర్ ఆందోళన

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. జహంగీర్ మాట్లాడుతూ, పేదలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. బైకాని నరసింహ కూడా మెరుగైన వైద్యం అందక మృతిచెందారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరిస్తే పేదలకు ఉపశమనం లభిస్తుందని సూచించారు.

గోసంగి వేషంతో ఆకట్టుకున్న కళాకారులు

సంతాప సభలో ప్రజానాట్యమండలి కళాకారులు గోసంగి వేషంతో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కులవ్యవస్థ, అంటరానితనం వంటి సామాజిక సమస్యలపై చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించారు. అమరవీరుల గీతాలతో సభకు ఉత్తేజం నింపారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా, మండల నాయకులు, సీఐటీయూ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు బైకాని నర్మద, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News