Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. సాంబశివరెడ్డి12 వ వర్ధంతికి ఘన నివాళులు

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. సాంబశివరెడ్డి12 వ వర్ధంతికి ఘన నివాళులు

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. సాంబశివరెడ్డి12 వ వర్ధంతికి ఘన నివాళులు
February 10, 2026 04:10 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మాజీ సర్పంచ్ తాళ్లూరి సాంబశివరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఉన్న సాంబశివరెడ్డి విగ్రహం వద్ద ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నేతలు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ తాళ్లూరి రాధా రాణి పాల్గొని విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి ప్రజల కోసం చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పలువురు పేర్కొన్నారు.కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, అల్లు చెన్నారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిదరాల దుర్గా పార్వతి మధుబాబు, మండల పార్టీ అధ్యక్షుడు చింతా విష్ణు, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సోషల్ మీడియా ప్రతినిధి వైవి సత్యనారాయణ, ఎంపీటీసీ విజయభాస్కర్, వైస్ ప్రెసిడెంట్ వడ్లమాని వెంకటేశ్వర రెడ్డి, అలవాల శంకర్ రెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, రామాచారి, నాగ దుర్గారావుతో పాటు పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News