ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. సాంబశివరెడ్డి12 వ వర్ధంతికి ఘన నివాళులు
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. సాంబశివరెడ్డి12 వ వర్ధంతికి ఘన నివాళులు
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మాజీ సర్పంచ్ తాళ్లూరి సాంబశివరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న సాంబశివరెడ్డి విగ్రహం వద్ద ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నేతలు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ తాళ్లూరి రాధా రాణి పాల్గొని విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి ప్రజల కోసం చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పలువురు పేర్కొన్నారు.కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, అల్లు చెన్నారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిదరాల దుర్గా పార్వతి మధుబాబు, మండల పార్టీ అధ్యక్షుడు చింతా విష్ణు, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సోషల్ మీడియా ప్రతినిధి వైవి సత్యనారాయణ, ఎంపీటీసీ విజయభాస్కర్, వైస్ ప్రెసిడెంట్ వడ్లమాని వెంకటేశ్వర రెడ్డి, అలవాల శంకర్ రెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, రామాచారి, నాగ దుర్గారావుతో పాటు పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి