Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:42 AM

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. సాంబశివరెడ్డి12 వ వర్ధంతికి ఘన నివాళులు

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. సాంబశివరెడ్డి12 వ వర్ధంతికి ఘన నివాళులు

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. సాంబశివరెడ్డి12 వ వర్ధంతికి ఘన నివాళులు
February 10, 2026 04:10 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మాజీ సర్పంచ్ తాళ్లూరి సాంబశివరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఉన్న సాంబశివరెడ్డి విగ్రహం వద్ద ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నేతలు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ తాళ్లూరి రాధా రాణి పాల్గొని విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి ప్రజల కోసం చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పలువురు పేర్కొన్నారు.కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, అల్లు చెన్నారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిదరాల దుర్గా పార్వతి మధుబాబు, మండల పార్టీ అధ్యక్షుడు చింతా విష్ణు, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సోషల్ మీడియా ప్రతినిధి వైవి సత్యనారాయణ, ఎంపీటీసీ విజయభాస్కర్, వైస్ ప్రెసిడెంట్ వడ్లమాని వెంకటేశ్వర రెడ్డి, అలవాల శంకర్ రెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, రామాచారి, నాగ దుర్గారావుతో పాటు పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News