Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:52 AM

ప్రజల అవసరాలకే ప్రాధాన్యం – జీఎంఆర్ మరో సేవా కార్యక్రమం

ప్రజల అవసరాలకే ప్రాధాన్యం – జీఎంఆర్ మరో సేవా కార్యక్రమం

ప్రజల అవసరాలకే ప్రాధాన్యం – జీఎంఆర్ మరో సేవా కార్యక్రమం
January 26, 2026 05:49 PM 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

*


*సుదినం న్యూస్ రిపోర్టర్ నారాయణఖేడ్ ప్రతినిధి*

నాగలిగిద్ద మండలం కిషన్ నాయక్ తండలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తూ, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ తమ సొంత నిధులతో నూతన బోరు ఏర్పాటు చేసి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు.గ్రామ ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి, వెంటనే స్పందిస్తూ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ప్రజల మన్ననలు పొందుతోంది. రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయత్నం తండ అభివృద్ధికి దోహదపడుతోంది.ఈ కార్యక్రమంలో

కిషన్ నాయక్ తండ సర్పంచ్ స్వప్న సంజు, ఉప సర్పంచ్ రేణుక రవి, రేక్య నాయక్ తండ సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ శంకర్,

మాజీ ఎంపిటిసి విజయ్,కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి,బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు ఆకుల రాములు,మైనెల్లి మాజీ సర్పంచ్ విఠల్ రావు పటేల్,నారాయణఖేడ్ మున్సిపల్ నాలుగవ వార్డు బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్,మెగా తండ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రహ్లాద్,మాజీ వార్డు సభ్యుడు సాయిలు,ఆర్‌ఎంపి రాందాస్, హన్మాన్లు, పవన్ కుమార్ ,పాటు పలువురు పార్టీ నాయకులు,గ్రామ పెద్దలు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ,గుఱ్ఱపు మచ్చేందర్ రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి సేవలందిస్తున్నారని, తండ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని గ్రామ ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News