ప్రజల అవసరాలకే ప్రాధాన్యం – జీఎంఆర్ మరో సేవా కార్యక్రమం
ప్రజల అవసరాలకే ప్రాధాన్యం – జీఎంఆర్ మరో సేవా కార్యక్రమం
Krishna
*
*సుదినం న్యూస్ రిపోర్టర్ నారాయణఖేడ్ ప్రతినిధి*
నాగలిగిద్ద మండలం కిషన్ నాయక్ తండలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తూ, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ తమ సొంత నిధులతో నూతన బోరు ఏర్పాటు చేసి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు.గ్రామ ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి, వెంటనే స్పందిస్తూ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ప్రజల మన్ననలు పొందుతోంది. రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయత్నం తండ అభివృద్ధికి దోహదపడుతోంది.ఈ కార్యక్రమంలో
కిషన్ నాయక్ తండ సర్పంచ్ స్వప్న సంజు, ఉప సర్పంచ్ రేణుక రవి, రేక్య నాయక్ తండ సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ శంకర్,
మాజీ ఎంపిటిసి విజయ్,కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి,బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆకుల రాములు,మైనెల్లి మాజీ సర్పంచ్ విఠల్ రావు పటేల్,నారాయణఖేడ్ మున్సిపల్ నాలుగవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్,మెగా తండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రహ్లాద్,మాజీ వార్డు సభ్యుడు సాయిలు,ఆర్ఎంపి రాందాస్, హన్మాన్లు, పవన్ కుమార్ ,పాటు పలువురు పార్టీ నాయకులు,గ్రామ పెద్దలు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ,గుఱ్ఱపు మచ్చేందర్ రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి సేవలందిస్తున్నారని, తండ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని గ్రామ ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి