Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:36 AM

ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తా

ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తా

ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తా
February 05, 2026 12:16 PM 166 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బిజెపి 11వ వార్డు అభ్యర్థి పోలోజు శ్రీధర్ బాబు

పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదని వార్డు ప్రగతి కోసమే వచ్చానని బిజెపి 11వ వార్డు అభ్యర్థి పోలోజు శ్రీధర్ బాబు అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డులో బిజెపి పార్టీ శ్రేణులతో వారి అభిమానులతో కలిసి పోలోజు శ్రీధర్ బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కమలం పువ్వు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ..గత ఐదు సంవత్సరముల క్రితం 11వ వార్డులో నన్ను విశ్వసించి, ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని వొమ్ము చేయకుండా వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని తెలిపారు. వార్డులో పేరుకుపోయిన అనేక రకాల సమస్యలను పరిష్కరించానని అన్నారు. ప్రజలు మరల నన్ను ఆశీర్వదిస్తారని ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల ఆదరణ చూస్తుంటే అర్థమవుతుందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరలా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని 11వ వార్డును చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంచుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాజపా నాయకులు అధిక సంఖ్యలో వారి అభిమానులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News