ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తా
ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తా
K.RAVI
బిజెపి 11వ వార్డు అభ్యర్థి పోలోజు శ్రీధర్ బాబు
పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదని వార్డు ప్రగతి కోసమే వచ్చానని బిజెపి 11వ వార్డు అభ్యర్థి పోలోజు శ్రీధర్ బాబు అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డులో బిజెపి పార్టీ శ్రేణులతో వారి అభిమానులతో కలిసి పోలోజు శ్రీధర్ బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కమలం పువ్వు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ..గత ఐదు సంవత్సరముల క్రితం 11వ వార్డులో నన్ను విశ్వసించి, ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని వొమ్ము చేయకుండా వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని తెలిపారు. వార్డులో పేరుకుపోయిన అనేక రకాల సమస్యలను పరిష్కరించానని అన్నారు. ప్రజలు మరల నన్ను ఆశీర్వదిస్తారని ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల ఆదరణ చూస్తుంటే అర్థమవుతుందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరలా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని 11వ వార్డును చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంచుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాజపా నాయకులు అధిక సంఖ్యలో వారి అభిమానులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి