Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:10 AM

ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తా

ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తా

ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తా
05-02-2026 187 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బిజెపి 11వ వార్డు అభ్యర్థి పోలోజు శ్రీధర్ బాబు

పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదని వార్డు ప్రగతి కోసమే వచ్చానని బిజెపి 11వ వార్డు అభ్యర్థి పోలోజు శ్రీధర్ బాబు అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డులో బిజెపి పార్టీ శ్రేణులతో వారి అభిమానులతో కలిసి పోలోజు శ్రీధర్ బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కమలం పువ్వు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ..గత ఐదు సంవత్సరముల క్రితం 11వ వార్డులో నన్ను విశ్వసించి, ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని వొమ్ము చేయకుండా వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని తెలిపారు. వార్డులో పేరుకుపోయిన అనేక రకాల సమస్యలను పరిష్కరించానని అన్నారు. ప్రజలు మరల నన్ను ఆశీర్వదిస్తారని ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల ఆదరణ చూస్తుంటే అర్థమవుతుందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరలా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని 11వ వార్డును చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంచుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాజపా నాయకులు అధిక సంఖ్యలో వారి అభిమానులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తా

Article Image

బిజెపి 11వ వార్డు అభ్యర్థి పోలోజు శ్రీధర్ బాబు

పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదని వార్డు ప్రగతి కోసమే వచ్చానని బిజెపి 11వ వార్డు అభ్యర్థి పోలోజు శ్రీధర్ బాబు అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డులో బిజెపి పార్టీ శ్రేణులతో వారి అభిమానులతో కలిసి పోలోజు శ్రీధర్ బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కమలం పువ్వు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ..గత ఐదు సంవత్సరముల క్రితం 11వ వార్డులో నన్ను విశ్వసించి, ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని వొమ్ము చేయకుండా వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని తెలిపారు. వార్డులో పేరుకుపోయిన అనేక రకాల సమస్యలను పరిష్కరించానని అన్నారు. ప్రజలు మరల నన్ను ఆశీర్వదిస్తారని ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల ఆదరణ చూస్తుంటే అర్థమవుతుందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరలా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని 11వ వార్డును చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంచుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాజపా నాయకులు అధిక సంఖ్యలో వారి అభిమానులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News