ప్రజల ఆశీర్వాదాలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ
ప్రజల ఆశీర్వాదాలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ
Krishna
నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గజ్జెల కాంతం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. ఈ ప్రచారానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికారు.నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరిగిన ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో, నాలుగో వార్డుల్లో విస్తృతంగా పర్యటించి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నారాయణఖేడ్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలపై స్పష్టంగా తెలియజేశారు.అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని పట్టణ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, పట్టణానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా, ప్రజల మద్దతుతో కొనసాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి