ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం
ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం
స్థానికం బృందం
గ్రామాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడిన వడ్డెర సంఘం నాయకులు
రామన్నపేటలో ఘనంగా సన్మాన కార్యక్రమం
స్థానికం వార్తలు, రామన్నపేట:
గ్రామానికి ఎనలేని సేవలు అందిస్తూ, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన గరిక సత్యనారాయణను వడ్డెర సంఘం నాయకులు మరియు కుల బంధువులు ఘనంగా సన్మానించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.
రామన్నపేట సర్పంచ్ మరియు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మన ఊరిలో గరిక సత్యనారాయణ చేసిన అభివృద్ధి పనులు, సేవలను నాయకులు కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పలువురి హాజరు:
ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ముఖ్య నాయకులు పల్లపు మల్లయ్య, గండికోట రాములు, గొలుసుల ప్రసాద్, దండుగుల సమ్మయ్య, వల్లపు సమ్మయ్య, దండుగుల రాములు, పల్లపు నరసింహ, పల్లపు రవి, శివరాత్రి సమ్మయ్య, శివరాత్రి రాజు, శివరాత్రి కుమార్, పల్లపు సమ్మయ్య, రాపోలు రాజశేఖర్, శివరాత్రి యాదగిరి, శివరాత్రి ఐలయ్య, రాపోలు ఉపేందర్, గుంజే నాగరాజు, గండికోట ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి