Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:22 AM

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం
December 24, 2025 01:04 PM 333 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడిన వడ్డెర సంఘం నాయకులు

రామన్నపేటలో ఘనంగా సన్మాన కార్యక్రమం

స్థానికం వార్తలు, రామన్నపేట:

గ్రామానికి ఎనలేని సేవలు అందిస్తూ, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన గరిక సత్యనారాయణను వడ్డెర సంఘం నాయకులు మరియు కుల బంధువులు ఘనంగా సన్మానించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.

రామన్నపేట సర్పంచ్ మరియు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మన ఊరిలో గరిక సత్యనారాయణ చేసిన అభివృద్ధి పనులు, సేవలను నాయకులు కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పలువురి హాజరు:

ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ముఖ్య నాయకులు పల్లపు మల్లయ్య, గండికోట రాములు, గొలుసుల ప్రసాద్, దండుగుల సమ్మయ్య, వల్లపు సమ్మయ్య, దండుగుల రాములు, పల్లపు నరసింహ, పల్లపు రవి, శివరాత్రి సమ్మయ్య, శివరాత్రి రాజు, శివరాత్రి కుమార్, పల్లపు సమ్మయ్య, రాపోలు రాజశేఖర్, శివరాత్రి యాదగిరి, శివరాత్రి ఐలయ్య, రాపోలు ఉపేందర్, గుంజే నాగరాజు, గండికోట ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News