Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:58 AM

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం
December 24, 2025 01:04 PM 350 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడిన వడ్డెర సంఘం నాయకులు

రామన్నపేటలో ఘనంగా సన్మాన కార్యక్రమం

స్థానికం వార్తలు, రామన్నపేట:

గ్రామానికి ఎనలేని సేవలు అందిస్తూ, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన గరిక సత్యనారాయణను వడ్డెర సంఘం నాయకులు మరియు కుల బంధువులు ఘనంగా సన్మానించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.

రామన్నపేట సర్పంచ్ మరియు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మన ఊరిలో గరిక సత్యనారాయణ చేసిన అభివృద్ధి పనులు, సేవలను నాయకులు కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పలువురి హాజరు:

ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ముఖ్య నాయకులు పల్లపు మల్లయ్య, గండికోట రాములు, గొలుసుల ప్రసాద్, దండుగుల సమ్మయ్య, వల్లపు సమ్మయ్య, దండుగుల రాములు, పల్లపు నరసింహ, పల్లపు రవి, శివరాత్రి సమ్మయ్య, శివరాత్రి రాజు, శివరాత్రి కుమార్, పల్లపు సమ్మయ్య, రాపోలు రాజశేఖర్, శివరాత్రి యాదగిరి, శివరాత్రి ఐలయ్య, రాపోలు ఉపేందర్, గుంజే నాగరాజు, గండికోట ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News