Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:54 AM

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి ప్రజా పాలన : తుంబూరు దయాకర్ రెడ్డి

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి ప్రజా పాలన : తుంబూరు దయాకర్ రెడ్డి

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి ప్రజా పాలన : తుంబూరు దయాకర్ రెడ్డి
January 01, 2026 06:39 PM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

ఖమ్మం: స్థానికం ప్రతినిధి జనార్ధన్

ప్రజా పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు నూతన సంవత్సరంలో కూడా ప్రతి అర్హుడికి చేరాలని దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా పాలనలో రెండేళ్ల కాలంలోనే “మంత్రి పొంగులేటి మార్క్” స్పష్టంగా కనిపిస్తోందని, సొంత నియోజకవర్గం పాలేరుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ సంక్షేమ పథకాల అమలులో ఆయన ప్రత్యేక ముద్ర వేశారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News