ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి ప్రజా పాలన : తుంబూరు దయాకర్ రెడ్డి
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి ప్రజా పాలన : తుంబూరు దయాకర్ రెడ్డి
Editor Desk
క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
ఖమ్మం: స్థానికం ప్రతినిధి జనార్ధన్
ప్రజా పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు నూతన సంవత్సరంలో కూడా ప్రతి అర్హుడికి చేరాలని దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా పాలనలో రెండేళ్ల కాలంలోనే “మంత్రి పొంగులేటి మార్క్” స్పష్టంగా కనిపిస్తోందని, సొంత నియోజకవర్గం పాలేరుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ సంక్షేమ పథకాల అమలులో ఆయన ప్రత్యేక ముద్ర వేశారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి