Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:33 AM

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి ప్రజా పాలన : తుంబూరు దయాకర్ రెడ్డి

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి ప్రజా పాలన : తుంబూరు దయాకర్ రెడ్డి

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి ప్రజా పాలన : తుంబూరు దయాకర్ రెడ్డి
01-01-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

ఖమ్మం: స్థానికం ప్రతినిధి జనార్ధన్

ప్రజా పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు నూతన సంవత్సరంలో కూడా ప్రతి అర్హుడికి చేరాలని దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా పాలనలో రెండేళ్ల కాలంలోనే “మంత్రి పొంగులేటి మార్క్” స్పష్టంగా కనిపిస్తోందని, సొంత నియోజకవర్గం పాలేరుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ సంక్షేమ పథకాల అమలులో ఆయన ప్రత్యేక ముద్ర వేశారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి ప్రజా పాలన : తుంబూరు దయాకర్ రెడ్డి

Article Image

క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

ఖమ్మం: స్థానికం ప్రతినిధి జనార్ధన్

ప్రజా పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు నూతన సంవత్సరంలో కూడా ప్రతి అర్హుడికి చేరాలని దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా పాలనలో రెండేళ్ల కాలంలోనే “మంత్రి పొంగులేటి మార్క్” స్పష్టంగా కనిపిస్తోందని, సొంత నియోజకవర్గం పాలేరుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ సంక్షేమ పథకాల అమలులో ఆయన ప్రత్యేక ముద్ర వేశారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News