Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:39 PM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి – జిల్లా ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి – జిల్లా ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి – జిల్లా ఎస్పీ
December 29, 2025 04:52 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా సమస్యలతో జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ, వారి సమస్యను విని, సమస్యకు కారణమవుతున్న అంశాలపై సంబంధిత ఎస్‌.హెచ్‌.ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు భరోసా కల్పించాలని, సివిల్ వివాదాలకు దూరంగా ఉండాలని ఎస్‌.హెచ్‌.ఓలకు సూచించడం జరిగింది.

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ సమస్యలు స్థానిక పోలీస్ స్టేషన్‌లలో పరిష్కారం దొరకనప్పుడు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోనుకాకుండా నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించబడుతున్న ప్రజావాణి కార్యక్రమ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News