Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:22 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్
04-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జహీరాబాద్/న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచుల సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జ్ డా. చంద్రశేఖర్ మార్గనిర్దేశకత్వం వహించగా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్‌ను హాద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ జహీరుద్దీన్ మూర్తుజ పూలమాల, శాలువాతో సత్కరించారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన జహీరుద్దీన్‌కు పార్టీ నాయకత్వం భరోసా కల్పిస్తూ, భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

కార్యక్రమంలో యువ నాయకుడు జిషన్ పటేల్, మాజీ ఎంపీటీసీ మొహమ్మద్ షుకూర్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్

Article Image

జహీరాబాద్/న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచుల సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జ్ డా. చంద్రశేఖర్ మార్గనిర్దేశకత్వం వహించగా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్‌ను హాద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ జహీరుద్దీన్ మూర్తుజ పూలమాల, శాలువాతో సత్కరించారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన జహీరుద్దీన్‌కు పార్టీ నాయకత్వం భరోసా కల్పిస్తూ, భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

కార్యక్రమంలో యువ నాయకుడు జిషన్ పటేల్, మాజీ ఎంపీటీసీ మొహమ్మద్ షుకూర్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News