ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్
Editor Desk
జహీరాబాద్/న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్లు, ఉప సర్పంచుల సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జ్ డా. చంద్రశేఖర్ మార్గనిర్దేశకత్వం వహించగా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్లు, ఉప సర్పంచులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్ను హాద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ జహీరుద్దీన్ మూర్తుజ పూలమాల, శాలువాతో సత్కరించారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన జహీరుద్దీన్కు పార్టీ నాయకత్వం భరోసా కల్పిస్తూ, భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
కార్యక్రమంలో యువ నాయకుడు జిషన్ పటేల్, మాజీ ఎంపీటీసీ మొహమ్మద్ షుకూర్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి