Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:09 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్
January 04, 2026 08:14 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జహీరాబాద్/న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచుల సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జ్ డా. చంద్రశేఖర్ మార్గనిర్దేశకత్వం వహించగా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్‌ను హాద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ జహీరుద్దీన్ మూర్తుజ పూలమాల, శాలువాతో సత్కరించారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన జహీరుద్దీన్‌కు పార్టీ నాయకత్వం భరోసా కల్పిస్తూ, భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

కార్యక్రమంలో యువ నాయకుడు జిషన్ పటేల్, మాజీ ఎంపీటీసీ మొహమ్మద్ షుకూర్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News