స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్
తమతో చదువుకొని ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన మిత్రులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని చాడ గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ సర్పంచ్ గా,భూమయ్య ఉప సర్పంచ్ ఇటీవలి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారిని చాడ గ్రామ జెస్పిహెచ్ఎస్ 2000-2001 బ్యాచ్ పూర్వ విద్యార్థులు వారికి శుభాకాంక్షలు తెలిపి వారిని ఘనంగా సన్మానించారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ మాతో కలిసి చదివి నేడు గ్రామ ప్రజల మన్నెలను పొంది ప్రజా ప్రతినిధులుగా గెలవడం ఛాల గర్వంగా ఉందన్నారు.భవిష్యత్ లో మరింత ఎదగలనీ ప్రజలకు సేవలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బి మహేందర్ చంద్ర చారి,సంతోష్ కుమార్,మధు,శోభ,అనిత,అలివేలు,రాధిక,హేమలత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి