PRINT TIME: April 07, 2026 09:03 PM
ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి: మంత్రి సవిత
ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి: మంత్రి సవిత
April 07, 2026 07:25 PM
17 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆర్ & బి అతిథి గృహంలో పంచాయతీల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యం, శానిటేషన్, వీధి దీపాలు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి