Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:30 PM

ప్రజా సమస్యల పరిష్కారకుడు సలీం ను గెలిపించండి: తుమ్మల పిలుపు

ప్రజా సమస్యల పరిష్కారకుడు సలీం ను గెలిపించండి: తుమ్మల పిలుపు

ప్రజా సమస్యల పరిష్కారకుడు సలీం ను గెలిపించండి: తుమ్మల పిలుపు
February 06, 2026 08:51 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ప్రజా సమస్యల పరిష్కారకుడు సలీం ను గెలిపించండి: తుమ్మల పిలుపు

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే ప్రజా నాయకుడు సలీం గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి కోరారు.శుక్రవారం టిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి సలీం గెలుపును కాంక్షిస్తూ 20వ డివిజన్లో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ 20 వ డివిజన్ 80 శాతం కార్మిక వర్గం నివాసం ఉంటున్న గ్రామీణ ప్రాంత వాతావరణం కలిగి ఉన్నదని ఉపాధి అవకాశాలు లేక చేసిన పనికి కూలి గిట్టుబాటు గాక ఇబ్బందులు పడుతున్న కార్మిక వర్గం పక్షాన పోరాడే సలీం గెలిపించడం ద్వారా ఎంతో ఉపయోగం జరుగుతుందని అన్నారు. మాజీ కౌన్సిలర్ గా డివిజన్ సమస్యల పట్ల సమగ్ర అనుభవం కలిగిన నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయగల సామర్థ్యం కలిగిన సలీం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు

 హామీలు అమలు చేయని కాంగ్రెస్ ను ఓడించండి --- సలీం

 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని 20వ డివిజన్ టిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం 21 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి సలీం అన్నారు పెన్షన్లు 2000 నుండి 4 వేలకు నాలుగువేల వికలాంగుల 6 వేలకు పెంచుతామని హామీ మహిళలకు 2500 హామీ 500 రూపాయలకే గ్యాస్ అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు రైతులకు రుణమాఫీ రైతు భరోసా ఆపివేయడంతో వ్యవసాయానికి పెట్టుబడి లేక రైతులను అవస్థలు పడుతున్నారని అన్నారు భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా 12000 ఇస్తానని హామీ అతీగతీ లేకుండా పోయిందని అన్నారు. డివిజన్ లో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన కలిగిన నా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి నల్లగొండ పట్టణ, మండల కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు జిల్లా కమిటీ సభ్యులు కొండ అనురాధ, బి ఆర్ ఎస్ ,సీపీఎం నాయకులు తుమ్మల పద్మ, రత్నం యాదయ్య, జక్కల జానీ, పాక దేవి,గాదె నర్సింహ, కత్తుల రవికుమార్, చింతల భిక్షపతి,మన్నే శంకరయ్య, మధుసూదన్ రెడ్డి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News