Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:59 AM

ప్రజా సమస్యల పరిష్కారకుడు సలీం ను గెలిపించండి: తుమ్మల పిలుపు

ప్రజా సమస్యల పరిష్కారకుడు సలీం ను గెలిపించండి: తుమ్మల పిలుపు

ప్రజా సమస్యల పరిష్కారకుడు సలీం ను గెలిపించండి: తుమ్మల పిలుపు
06-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ప్రజా సమస్యల పరిష్కారకుడు సలీం ను గెలిపించండి: తుమ్మల పిలుపు

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే ప్రజా నాయకుడు సలీం గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి కోరారు.శుక్రవారం టిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి సలీం గెలుపును కాంక్షిస్తూ 20వ డివిజన్లో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ 20 వ డివిజన్ 80 శాతం కార్మిక వర్గం నివాసం ఉంటున్న గ్రామీణ ప్రాంత వాతావరణం కలిగి ఉన్నదని ఉపాధి అవకాశాలు లేక చేసిన పనికి కూలి గిట్టుబాటు గాక ఇబ్బందులు పడుతున్న కార్మిక వర్గం పక్షాన పోరాడే సలీం గెలిపించడం ద్వారా ఎంతో ఉపయోగం జరుగుతుందని అన్నారు. మాజీ కౌన్సిలర్ గా డివిజన్ సమస్యల పట్ల సమగ్ర అనుభవం కలిగిన నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయగల సామర్థ్యం కలిగిన సలీం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు

 హామీలు అమలు చేయని కాంగ్రెస్ ను ఓడించండి --- సలీం

 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని 20వ డివిజన్ టిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం 21 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి సలీం అన్నారు పెన్షన్లు 2000 నుండి 4 వేలకు నాలుగువేల వికలాంగుల 6 వేలకు పెంచుతామని హామీ మహిళలకు 2500 హామీ 500 రూపాయలకే గ్యాస్ అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు రైతులకు రుణమాఫీ రైతు భరోసా ఆపివేయడంతో వ్యవసాయానికి పెట్టుబడి లేక రైతులను అవస్థలు పడుతున్నారని అన్నారు భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా 12000 ఇస్తానని హామీ అతీగతీ లేకుండా పోయిందని అన్నారు. డివిజన్ లో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన కలిగిన నా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి నల్లగొండ పట్టణ, మండల కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు జిల్లా కమిటీ సభ్యులు కొండ అనురాధ, బి ఆర్ ఎస్ ,సీపీఎం నాయకులు తుమ్మల పద్మ, రత్నం యాదయ్య, జక్కల జానీ, పాక దేవి,గాదె నర్సింహ, కత్తుల రవికుమార్, చింతల భిక్షపతి,మన్నే శంకరయ్య, మధుసూదన్ రెడ్డి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా సమస్యల పరిష్కారకుడు సలీం ను గెలిపించండి: తుమ్మల పిలుపు

Article Image

ప్రజా సమస్యల పరిష్కారకుడు సలీం ను గెలిపించండి: తుమ్మల పిలుపు

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే ప్రజా నాయకుడు సలీం గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి కోరారు.శుక్రవారం టిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి సలీం గెలుపును కాంక్షిస్తూ 20వ డివిజన్లో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ 20 వ డివిజన్ 80 శాతం కార్మిక వర్గం నివాసం ఉంటున్న గ్రామీణ ప్రాంత వాతావరణం కలిగి ఉన్నదని ఉపాధి అవకాశాలు లేక చేసిన పనికి కూలి గిట్టుబాటు గాక ఇబ్బందులు పడుతున్న కార్మిక వర్గం పక్షాన పోరాడే సలీం గెలిపించడం ద్వారా ఎంతో ఉపయోగం జరుగుతుందని అన్నారు. మాజీ కౌన్సిలర్ గా డివిజన్ సమస్యల పట్ల సమగ్ర అనుభవం కలిగిన నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయగల సామర్థ్యం కలిగిన సలీం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు

 హామీలు అమలు చేయని కాంగ్రెస్ ను ఓడించండి --- సలీం

 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని 20వ డివిజన్ టిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం 21 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి సలీం అన్నారు పెన్షన్లు 2000 నుండి 4 వేలకు నాలుగువేల వికలాంగుల 6 వేలకు పెంచుతామని హామీ మహిళలకు 2500 హామీ 500 రూపాయలకే గ్యాస్ అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు రైతులకు రుణమాఫీ రైతు భరోసా ఆపివేయడంతో వ్యవసాయానికి పెట్టుబడి లేక రైతులను అవస్థలు పడుతున్నారని అన్నారు భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా 12000 ఇస్తానని హామీ అతీగతీ లేకుండా పోయిందని అన్నారు. డివిజన్ లో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన కలిగిన నా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి నల్లగొండ పట్టణ, మండల కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు జిల్లా కమిటీ సభ్యులు కొండ అనురాధ, బి ఆర్ ఎస్ ,సీపీఎం నాయకులు తుమ్మల పద్మ, రత్నం యాదయ్య, జక్కల జానీ, పాక దేవి,గాదె నర్సింహ, కత్తుల రవికుమార్, చింతల భిక్షపతి,మన్నే శంకరయ్య, మధుసూదన్ రెడ్డి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News