Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 10, 2026 01:10 AM

ప్రజా పోరాటాలకు విరాళాలు ఇవ్వండి: సీపీఐ

ప్రజా పోరాటాలకు విరాళాలు ఇవ్వండి: సీపీఐ

ప్రజా పోరాటాలకు విరాళాలు ఇవ్వండి: సీపీఐ
March 09, 2026 08:36 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి జరుగుతున్న పోరాటాలకు విరివిగా విరాళాలు ఇచ్చి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి సహకరించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. సోమందేపల్లిలో ఇంటింటికి తిరుగుతూ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీపీఐ పార్టీ ఆవిర్భవించి 101 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కార్మికులు, కష్టజీవులు, పేదల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ వస్తోందని పేర్కొన్నారు. ప్రజలు విరివిగా విరాళాలు అందించి పార్టీకి అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలస్వామి, జిల్లా కమిటీ సభ్యుడు నార్సింపల్లి ఆంజనేయులు, చేనేత జిల్లా నాయకుడు షీలా నారాయణస్వామి, సోమందేపల్లి సీపీఐ మండల కార్యదర్శి రాజగోపాల్, సహాయ కార్యదర్శులు చాంద్‌బాషా, అంజనమ్మ, గంగరాజు, శ్రీకాంత్, హెచ్‌.కే. ఆంజనేయులు, రామాంజనమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News