Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:51 AM

ప్రజా పోరాటాలకు విరాళాలు ఇవ్వండి: సీపీఐ

ప్రజా పోరాటాలకు విరాళాలు ఇవ్వండి: సీపీఐ

ప్రజా పోరాటాలకు విరాళాలు ఇవ్వండి: సీపీఐ
09-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి జరుగుతున్న పోరాటాలకు విరివిగా విరాళాలు ఇచ్చి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి సహకరించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. సోమందేపల్లిలో ఇంటింటికి తిరుగుతూ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీపీఐ పార్టీ ఆవిర్భవించి 101 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కార్మికులు, కష్టజీవులు, పేదల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ వస్తోందని పేర్కొన్నారు. ప్రజలు విరివిగా విరాళాలు అందించి పార్టీకి అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలస్వామి, జిల్లా కమిటీ సభ్యుడు నార్సింపల్లి ఆంజనేయులు, చేనేత జిల్లా నాయకుడు షీలా నారాయణస్వామి, సోమందేపల్లి సీపీఐ మండల కార్యదర్శి రాజగోపాల్, సహాయ కార్యదర్శులు చాంద్‌బాషా, అంజనమ్మ, గంగరాజు, శ్రీకాంత్, హెచ్‌.కే. ఆంజనేయులు, రామాంజనమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

ప్రజా పోరాటాలకు విరాళాలు ఇవ్వండి: సీపీఐ

Article Image

సోమందేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి జరుగుతున్న పోరాటాలకు విరివిగా విరాళాలు ఇచ్చి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి సహకరించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. సోమందేపల్లిలో ఇంటింటికి తిరుగుతూ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీపీఐ పార్టీ ఆవిర్భవించి 101 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కార్మికులు, కష్టజీవులు, పేదల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ వస్తోందని పేర్కొన్నారు. ప్రజలు విరివిగా విరాళాలు అందించి పార్టీకి అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలస్వామి, జిల్లా కమిటీ సభ్యుడు నార్సింపల్లి ఆంజనేయులు, చేనేత జిల్లా నాయకుడు షీలా నారాయణస్వామి, సోమందేపల్లి సీపీఐ మండల కార్యదర్శి రాజగోపాల్, సహాయ కార్యదర్శులు చాంద్‌బాషా, అంజనమ్మ, గంగరాజు, శ్రీకాంత్, హెచ్‌.కే. ఆంజనేయులు, రామాంజనమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News