ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.
Editor Desk
ఎల్బీనగర్
99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై వివరించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, సరూర్నగర్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సరూర్నగర్ మండలం పరిధిలోని మహిళా లబ్ధిదారులకు ‘కళ్యాణ లక్ష్మి’ పథకం కింద 22 చెక్కులు, ‘షాదీ ముబారక్’ కింద 8 చెక్కులను డీసీ శ్రీనివాస్ పంపిణీ చేశారు.
అలాగే 2027 జనగణనలో భాగంగా ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ ప్రక్రియపై జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ప్రజలకు అవగాహన కల్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి