Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 07:51 PM

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.
May 02, 2026 05:56 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై వివరించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, సరూర్‌నగర్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సరూర్‌నగర్ మండలం పరిధిలోని మహిళా లబ్ధిదారులకు ‘కళ్యాణ లక్ష్మి’ పథకం కింద 22 చెక్కులు, ‘షాదీ ముబారక్’ కింద 8 చెక్కులను డీసీ శ్రీనివాస్ పంపిణీ చేశారు.

అలాగే 2027 జనగణనలో భాగంగా ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ ప్రక్రియపై జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ప్రజలకు అవగాహన కల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News