Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:44 AM

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికతో అన్ని వర్గాల సంక్షేమం: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికతో అన్ని వర్గాల సంక్షేమం: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికతో అన్ని వర్గాల సంక్షేమం: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్
10-03-2026 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

​తొలి 15 రోజులు పారిశుధ్యం: అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించాలి అని అధికారులకు సూచించారు. ఉగాది నాటికి తుది దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి, సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలి అని, పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని . డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలను అందుబాటులోకి తీసుకురావాలి తెలియజేశారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ

గత రెండేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ 99 రోజుల ప్రణాళిక ఉద్దేశమని అన్నారు. సన్నబియ్యం, ఉచిత విద్యుత్ (200 యూనిట్లు), మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు యువత సహకరించాలని కోరారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ,

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పలు కీలక సూచనలు చేశారు: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద మరణాల్లో 90 శాతం హెల్మెట్ లేకపోవడం వల్లే జరిగాయని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు.

​బ్లాక్ స్పాట్స్ తగ్గింపు: 2023లో 59గా ఉన్న ప్రమాదకర ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లను 2025 నాటికి 31కి తగ్గించామని తెలిపారు.గంజాయి సమాచారం తెలిస్తే వెంటనే 8712670266 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీడీవోలు, తహసిల్దారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికతో అన్ని వర్గాల సంక్షేమం: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

Article Image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

​తొలి 15 రోజులు పారిశుధ్యం: అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించాలి అని అధికారులకు సూచించారు. ఉగాది నాటికి తుది దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి, సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలి అని, పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని . డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలను అందుబాటులోకి తీసుకురావాలి తెలియజేశారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ

గత రెండేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ 99 రోజుల ప్రణాళిక ఉద్దేశమని అన్నారు. సన్నబియ్యం, ఉచిత విద్యుత్ (200 యూనిట్లు), మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు యువత సహకరించాలని కోరారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ,

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పలు కీలక సూచనలు చేశారు: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద మరణాల్లో 90 శాతం హెల్మెట్ లేకపోవడం వల్లే జరిగాయని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు.

​బ్లాక్ స్పాట్స్ తగ్గింపు: 2023లో 59గా ఉన్న ప్రమాదకర ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లను 2025 నాటికి 31కి తగ్గించామని తెలిపారు.గంజాయి సమాచారం తెలిస్తే వెంటనే 8712670266 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీడీవోలు, తహసిల్దారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News