Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 11, 2026 03:28 PM

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పహడినగర్‌లో పారిశుద్ధ్య పనులు

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పహడినగర్‌లో పారిశుద్ధ్య పనులు

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పహడినగర్‌లో పారిశుద్ధ్య పనులు
March 10, 2026 09:14 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక” కార్యక్రమం మార్చి 6వ తేదీ నుండి మార్చి 15వ తేదీ వరకు నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం భువనగిరి పట్టణంలోని 30వ వార్డు పహడినగర్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం మరియు వార్డు కౌన్సిలర్ ఎండీ.లయిక్ అహ్మద్ పాల్గొని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే వార్డులో ఉన్న పలు సమస్యలను మున్సిపల్ కమిషనర్‌తో కలిసి కౌన్సిలర్ ఎండీ.లయిక్ అహ్మద్ పరిశీలించి,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News