Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.సర్పంచ్ కంచి మధుసూదన్ TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 06:57 PM

ప్రజా క్షేత్రంలో సాంబశివుని పోరాటం చిరస్మరణీయం

ప్రజా క్షేత్రంలో సాంబశివుని పోరాటం చిరస్మరణీయం

ప్రజా క్షేత్రంలో సాంబశివుని పోరాటం చిరస్మరణీయం
March 26, 2026 04:37 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండలో ఘనంగా 15వ వర్ధంతి వేడుకలు..

భువనగిరి జిల్లాకు సాంబశివుని పేరు పెట్టాలని డిమాండ్..


నల్లగొండ :పేద ప్రజల హక్కుల కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు కొనపురి సాంబశివుడు అని పలువురు వక్తలు కొనియాడారు. బీఆర్ఎస్ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివుని 15వ వర్ధంతిని గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. యాదవ రాజ్యాధికార పోరాట సమితి (YRPS) రాష్ట్ర అధ్యక్షుడు చల్లా కోటేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, 20వ వార్డు కౌన్సిలర్ అల్లి సుభాష్ యాదవ్ మాట్లాడుతూ.. అడవిలో ఉన్నప్పుడు ఆదివాసుల హక్కుల కోసం, జనజీవన స్రవంతిలోకి వచ్చాక ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం సాంబశివుడు నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన ఆయన సేవలకు గుర్తింపుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు 'కొనపురి సాంబశివుడు' పేరు పెట్టాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజ్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు మామిడి పద్మ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొమ్మరబోయిన నాగార్జున, కట్ట శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే జిల్లా యాదవ సంఘం నాయకులు కన్నెబోయిన అంజిబాబు, కుంటిగొర్ల లింగయ్య, మిరియాల సైదులు, గుండెబోయిన సురేష్, మట్టిపల్లి సతీష్, బిఎస్ఎఫ్ ప్రవీణ్, మోదాల రాంబాబు, జానపాటి శంకర్, మేక శ్రీధర్ రెడ్డి, నడ్డి శంకర్, కిషోర్, యుగంధర్, బొల్లం లింగయ్య, గరిగంటి నాగయ్య, హరిబాబు, అనిల్, లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొని అంజలి ఘటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News