ప్రజా గొంతుక సీపీఐఎం 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ ను గెలిపించండి
ప్రజా గొంతుక సీపీఐఎం 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ ను గెలిపించండి
K.RAVI
సీపీఎం మండల కార్యవర్గ సభ్యులు తడక మోహన్
స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా గొంతుకలను గెలిపించాలని, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సీపీఐ (ఎం) 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) చౌటుప్పల్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు తడక మోహన్ పిలుపునిచ్చారు.చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ విజయాన్ని కాంక్షిస్తూ తడక మోహన్ ఇంటికి ప్రచారం నిర్వహించారు. సుత్తి కోడవలి నక్షత్రం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గోశిక సుమతి ని గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.మున్సిపల్ అభివృద్ధి కావాలన్నా, ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా సీపీఐ (ఎం) అభ్యర్థులు మున్సిపాలిటీలో ఉండాలన్నారు. పాలకవర్గంలోనూ ప్రజా సమస్యలు నిరంతరం ఎజెండాగాఉండి అవి పరిష్కారం కావాలంటే ప్రజా పోరాటాలు లో ముందుండే సీపీఐ (ఎం) అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.సిపిఎం 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుత్తె కొడవలి నక్షత్రం గుర్తుపై వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోశిక స్వామి,అవ్వరు గోవర్ధన్,రామేశ్వరి, చింతల మధు,చింతకింది పాండు, కలకుంట్ల శివ, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి