Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

ప్రజా గొంతుక సీపీఐఎం 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ ను గెలిపించండి

ప్రజా గొంతుక సీపీఐఎం 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ ను గెలిపించండి

ప్రజా గొంతుక సీపీఐఎం 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ ను గెలిపించండి
February 07, 2026 09:34 AM 193 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఎం మండల కార్యవర్గ సభ్యులు తడక మోహన్

స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా గొంతుకలను గెలిపించాలని, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సీపీఐ (ఎం) 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) చౌటుప్పల్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు తడక మోహన్ పిలుపునిచ్చారు.చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి గోశిక సుమతి కరుణాకర్ విజయాన్ని కాంక్షిస్తూ తడక మోహన్ ఇంటికి ప్రచారం నిర్వహించారు. సుత్తి కోడవలి నక్షత్రం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గోశిక సుమతి ని గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.మున్సిపల్ అభివృద్ధి కావాలన్నా, ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా సీపీఐ (ఎం) అభ్యర్థులు మున్సిపాలిటీలో ఉండాలన్నారు. పాలకవర్గంలోనూ ప్రజా సమస్యలు నిరంతరం ఎజెండాగాఉండి అవి పరిష్కారం కావాలంటే ప్రజా పోరాటాలు లో ముందుండే సీపీఐ (ఎం) అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.సిపిఎం 10వ వార్డు అభ్యర్థి గోశిక సుమతి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుత్తె కొడవలి నక్షత్రం గుర్తుపై వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోశిక స్వామి,అవ్వరు గోవర్ధన్,రామేశ్వరి, చింతల మధు,చింతకింది పాండు, కలకుంట్ల శివ, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News