ప్రజా ఆరోగ్య సేవలపై కలెక్టర్ దృష్టి – ప్రత్యేక వైద్య శిబిరాల తనిఖీ..
ప్రజా ఆరోగ్య సేవలపై కలెక్టర్ దృష్టి – ప్రత్యేక వైద్య శిబిరాల తనిఖీ..
Krishna
జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పీహెచ్సీలు,యూపీహెచ్సీలలో నిపుణులైన వైద్యులతో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్ష శిబిరాలను గురువారం ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి డిజిటల్ ఆరోగ్య వివరాల నమోదు,రోగుల వివరాల సేకరణ, నమోదు కౌంటర్ల పనితీరును పరిశీలించారు.రోగులకు ఇబ్బందులు కలగకుండా బాహ్య రోగుల నమోదు కౌంటర్లను పెంచాలని, అంతర్జాల వేగాన్ని మెరుగుపర్చాలని సూచించారు. అనంతరం బాహ్య రోగుల విభాగాలు, శస్త్రచికిత్స, స్త్రీ-పురుషుల వైద్య విభాగాలు, ఔషధ పంపిణీ కేంద్రం, నిల్వ గది, అత్యవసర సేవల విభాగాలను పరిశీలించి రికార్డుల నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు.తరువాత మైనార్టీ నివాస పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి విద్యార్థుల ఆరోగ్య పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు.రక్తహీనత, కంటి, చెవి, దంత సమస్యలు, పోషకాహార లోపాలను గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు. అనంతరం మార్క్స్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలు, ఆరోగ్య రికార్డులు, ఔషధ నిల్వలు, ప్రయోగశాల పనితీరును తనిఖీ చేశారు.
జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి