ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల భర్తీపై చర్యలు చేపట్టాలి
ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల భర్తీపై చర్యలు చేపట్టాలి
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విద్యా హక్కు చట్టం అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను భర్తీ చేయాలని కోరుతూ విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ అధ్యక్షుడు బోల్గురి ముకేష్, బుధవారం మండల విద్యాధికారి సైదా నాయక్కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉచిత సీట్ల కేటాయింపును జాతీయ మిషన్గా భావించి కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ నోటీసు బోర్డులపై అందుబాటులో ఉన్న ఉచిత సీట్ల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.
ఉచిత సీట్ల కింద ఎంపికైన విద్యార్థుల నుంచి పుస్తకాలు, యూనిఫామ్ లేదా ఇతర పేర్లతో ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. అలాగే కేవలం ఒకటో తరగతికే పరిమితం కాకుండా, 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో కూడా పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అంశంపై ఏప్రిల్ 30లోపు స్పష్టమైన కార్యాచరణ నివేదిక విడుదల చేయాలని ఫౌండేషన్ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ చైర్మన్ దోమలపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి