Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల భర్తీపై చర్యలు చేపట్టాలి

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల భర్తీపై చర్యలు చేపట్టాలి

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల భర్తీపై చర్యలు చేపట్టాలి
March 18, 2026 07:21 PM 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విద్యా హక్కు చట్టం అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను భర్తీ చేయాలని కోరుతూ విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ అధ్యక్షుడు బోల్గురి ముకేష్, బుధవారం మండల విద్యాధికారి సైదా నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉచిత సీట్ల కేటాయింపును జాతీయ మిషన్‌గా భావించి కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ నోటీసు బోర్డులపై అందుబాటులో ఉన్న ఉచిత సీట్ల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.

ఉచిత సీట్ల కింద ఎంపికైన విద్యార్థుల నుంచి పుస్తకాలు, యూనిఫామ్ లేదా ఇతర పేర్లతో ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. అలాగే కేవలం ఒకటో తరగతికే పరిమితం కాకుండా, 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో కూడా పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అంశంపై ఏప్రిల్ 30లోపు స్పష్టమైన కార్యాచరణ నివేదిక విడుదల చేయాలని ఫౌండేషన్ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ చైర్మన్ దోమలపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News