Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:12 AM

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల భర్తీపై చర్యలు చేపట్టాలి

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల భర్తీపై చర్యలు చేపట్టాలి

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల భర్తీపై చర్యలు చేపట్టాలి
March 18, 2026 07:21 PM 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విద్యా హక్కు చట్టం అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను భర్తీ చేయాలని కోరుతూ విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ అధ్యక్షుడు బోల్గురి ముకేష్, బుధవారం మండల విద్యాధికారి సైదా నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉచిత సీట్ల కేటాయింపును జాతీయ మిషన్‌గా భావించి కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ నోటీసు బోర్డులపై అందుబాటులో ఉన్న ఉచిత సీట్ల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.

ఉచిత సీట్ల కింద ఎంపికైన విద్యార్థుల నుంచి పుస్తకాలు, యూనిఫామ్ లేదా ఇతర పేర్లతో ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. అలాగే కేవలం ఒకటో తరగతికే పరిమితం కాకుండా, 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో కూడా పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అంశంపై ఏప్రిల్ 30లోపు స్పష్టమైన కార్యాచరణ నివేదిక విడుదల చేయాలని ఫౌండేషన్ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ చైర్మన్ దోమలపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News