ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష
ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు మున్సిపల్ చైర్మన్ పందిరి గీత తెలిపారు.గురువారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి 12 వార్డులలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అలాగే కార్యాలయంలో పెండింగ్లో ఉన్న ఫైళ్ల పరిష్కారం వంటి అంశాలపై చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని శుక్రవారం 12వ వార్డులోని హైస్కూల్ వెనుక భాగంలో ప్రారంభించనున్నట్లు చైర్మన్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ 99 రోజుల కార్యక్రమం కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి