Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కన్నతల్లినే కడతేర్చిన కుమార్తె.. ఇంట్లోనే పాతిపెట్టి సిమెంటుతో పూడ్చివేత స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 11:40 PM

ప్రగతి దిశగా చౌటుప్పల్ మున్సిపాలిటీ: రెండవ కౌన్సిల్ తొలి సమావేశం ఘన విజయం

ప్రగతి దిశగా చౌటుప్పల్ మున్సిపాలిటీ: రెండవ కౌన్సిల్ తొలి సమావేశం ఘన విజయం

ప్రగతి దిశగా చౌటుప్పల్ మున్సిపాలిటీ: రెండవ కౌన్సిల్ తొలి సమావేశం ఘన విజయం
March 25, 2026 10:06 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మూడు గంటల సుదీర్ఘ చర్చలు – ప్రజాహిత నిర్ణయాలకు ఆమోదం

చౌటుప్పల్ పురపాలక సంఘం రెండవ కౌన్సిల్ తొలి సాధారణ సమావేశం బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన ఉత్సాహభరితంగా, నిర్విఘ్నంగా మూడు గంటల పాటు జరిగింది. పట్టణాభివృద్ధి లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో ఎజెండాలోని పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, ప్రజాహిత నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పావని రమేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. “పార్టీలకు అతీతంగా ప్రతి వార్డును అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తాం. ప్రతి కౌన్సిలర్‌కు పూర్తి సహకారం అందిస్తాను. అదే విధంగా అందరూ పట్టణ అభివృద్ధికి సహకరించాలి” అని కోరారు.అంశాల వారీగా లోతైన చర్చ

సమావేశంలో ప్రత్యేకంగా చైర్‌పర్సన్ స్వయంగా ఎజెండాలోని ప్రతి అంశాన్ని చదివి వినిపించగా, కౌన్సిలర్లతో విస్తృతంగా చర్చించారు. అవసరమైన చోట మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి నుంచి వివరణ కోరారు. అంశాలపై సమగ్ర అవగాహన సాధించిన అనంతరం కొన్ని అంశాలను సవరించాలని సూచించగా, మరికొన్ని కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.అభివృద్ధే ప్రధాన లక్ష్యం మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పట్టణాభివృద్ధే ప్రధాన ఎజెండా అని, అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మాట్లాడుతూ ఇది తొలి సమావేశం అయినప్పటికీ సమస్యలు కొత్తవి కావని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో అన్ని వార్డుల కౌన్సిలర్లు పాల్గొని పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు (ఆర్, బీ నవీన్, మెడికల్ కాటమరాజు, అగ్రికల్చర్ నాగరాజు), మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ దీప, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News