PRINT TIME: May 26, 2026 10:34 PM
ప్రెస్ క్లబ్ భవనం కోసం సూర్యాపేటలో జర్నలిస్టుల పాదయాత్ర
ప్రెస్ క్లబ్ భవనం కోసం సూర్యాపేటలో జర్నలిస్టుల పాదయాత్ర
January 05, 2026 03:45 PM
77 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సొంత ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్జెఏ) ఆధ్వర్యంలో సోమవారం శాంతియుత పాదయాత్ర నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు జరిగిన ఈ పాదయాత్రకు సీనియర్ పాత్రికేయులు భూపతి రాములు గౌడ్, సుంకర బోయిన వెంకటయ్య యాదవ్ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యమ చరిత్ర కలిగిన సూర్యాపేటలో జర్నలిస్టులకు సొంత భవనం లేకపోవడం బాధాకరమన్నారు. టీఎస్జెఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ భవనం నిర్మించేంతవరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం జర్నలిస్టులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి