ప్రధాని మోడీ సభకు భారీగా తరలిరావాలి : బీజేపీ నేతల పిలుపు
ప్రధాని మోడీ సభకు భారీగా తరలిరావాలి : బీజేపీ నేతల పిలుపు
Krishna
ఆదివారం హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోవూరి సంగమేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు బలమైన నాయకత్వంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని అన్నారు. వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి, దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు మోడీ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గ ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో హైదరాబాద్కు విచ్చేస్తున్న ప్రధాని మోడీ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటూ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని కోవూరి సంగమేశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి