Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:29 AM

పారదర్శకంగా పాత సామగ్రి వేలం..

పారదర్శకంగా పాత సామగ్రి వేలం..

పారదర్శకంగా పాత సామగ్రి వేలం..
25-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

టెండర్ దారుల సమక్షంలో ప్రక్రియ పూర్తి..

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పాత, ఉపయోగించని సామగ్రిని టెండర్ దారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా బహిరంగ వేలం వేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఎస్పీ నియమించిన ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ నిర్వహించబడింది. కాలం చెల్లిన పాత టైర్లు, బ్యాటరీలు, ఖాళీ ఆయిల్ డ్రమ్ములు, ఇనుప విడి భాగాలు వంటి వివిధ రకాల పాత సామగ్రిని ఈ సందర్భంగా వేలం వేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, విధివిధానాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ వేలం కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. పోలీస్ శాఖలో ఉపయోగించరాని పాత సామగ్రిని ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా కార్యాలయ ప్రాంగణంలో శుభ్రతను పాటించవచ్చని, అదే సమయంలో పారదర్శక వేలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. శాఖా పరమైన నిర్వహణను మరింత సమర్థవంతంగా చేసేందుకు ఇలాంటి చర్యలు దోహదపడతాయని వివరించారు.​జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో జరిగిన ఈ వేలం కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్.బి డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీను పాల్గొన్నారు. వీరితో పాటు మోటర్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సూరప్ప నాయుడు, వెల్ఫేర్ ఆర్.ఐ సంతోష్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పారదర్శకంగా పాత సామగ్రి వేలం..

Article Image

టెండర్ దారుల సమక్షంలో ప్రక్రియ పూర్తి..

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పాత, ఉపయోగించని సామగ్రిని టెండర్ దారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా బహిరంగ వేలం వేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఎస్పీ నియమించిన ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ నిర్వహించబడింది. కాలం చెల్లిన పాత టైర్లు, బ్యాటరీలు, ఖాళీ ఆయిల్ డ్రమ్ములు, ఇనుప విడి భాగాలు వంటి వివిధ రకాల పాత సామగ్రిని ఈ సందర్భంగా వేలం వేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, విధివిధానాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ వేలం కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. పోలీస్ శాఖలో ఉపయోగించరాని పాత సామగ్రిని ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా కార్యాలయ ప్రాంగణంలో శుభ్రతను పాటించవచ్చని, అదే సమయంలో పారదర్శక వేలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. శాఖా పరమైన నిర్వహణను మరింత సమర్థవంతంగా చేసేందుకు ఇలాంటి చర్యలు దోహదపడతాయని వివరించారు.​జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో జరిగిన ఈ వేలం కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్.బి డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీను పాల్గొన్నారు. వీరితో పాటు మోటర్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సూరప్ప నాయుడు, వెల్ఫేర్ ఆర్.ఐ సంతోష్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News