ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి
కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి రంగా థియేటర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, అక్రమ నోటీసులతో ప్రతిపక్షాన్ని వేధించడం సరైనది కాదని వారు తీవ్రంగా మండిపడ్డారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి