ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి పట్టం కట్టండి
ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి పట్టం కట్టండి
K.RAVI
బత్తుల వాణి విప్లవ్ గౌడ్ 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి
తెలంగాణ ప్రజల సంక్షేమం
అభివృద్ధికి పట్టం కట్టిన రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో 13 వ వార్డ్ అభివృద్ధి చేస్తానని బత్తుల వాణి విప్లవ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు పథకం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, రైతుబంధు పథకం, రేషన్ కార్డుల పంపిణీ లాంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలు అందరికీ రాజకీయాలకతీతంగా, వర్గాలకతీతంగా ప్రతి వ్యక్తికి చేరేటట్లుగా ప్రభుత్వం పని చేస్తున్నదని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తమ పార్టీ వారికే పని చేసిందని, దాదాపు పది సంవత్సరాలపాటు అరాచక అవినీతి, దోపిడీకి తెలంగాణ గురైందని, మళ్లీ అలాంటి పొరపాట్లు చేయకుండా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు.13వ వార్డులో ప్రధాన సమస్యలన్నీ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో వార్డు సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి