ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటానికే ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం ప్రవేశపెట్టింది చాట్రాయి ఎంఈవో 2 వి ఎస్ వి బ్రహ్మాచారి
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటానికే ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం ప్రవేశపెట్టింది చాట్రాయి ఎంఈవో 2 వి ఎస్ వి బ్రహ్మాచారి
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మండలంలోని ప్రాధమిక ప్రాధమికొన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి కార్యక్రమం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఎం ఈ ఓ బ్రహ్మా చారి మాట్లాడుతూ సమాజాన్ని పాఠశాల ను సమన్వయo చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. విద్యాంజలి యాప్ లో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సమాజం లోని వ్యక్తులు వాలంటీర్లు గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. విద్యాంజలి కార్యక్రమం ద్వారా ఆశక్తి కలిగిన వాలంటీర్లు అవసరం కల్గిన పాఠశాలలో వారి ఆసక్తి మేరకు విద్యా బోధన చేయవచ్చని వివరించారు. పాఠశాలలో అవసరమైన కనీసం సౌకర్యంలు దాతలు ఏర్పాటు చేయవచ్చన్నారు విద్యాంజలిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దేశ విదేశాలలో వున్న పాఠశాలల పూర్వ విద్యార్థులు వారి వారి పాఠశాలలలో అవసరమైన ఉపకారణాలు అందించటంతో పాటు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయం చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు సంఖ్య పెంచటానికి ఇప్పటికే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం లో ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్, శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్స్ గా సంజీవ కుమార్, ఎ వి. వెంకటేశ్వరరావు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సి ఆర్ పి లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి