Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:01 PM

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటానికే ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం ప్రవేశపెట్టింది చాట్రాయి ఎంఈవో 2 వి ఎస్ వి బ్రహ్మాచారి

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటానికే ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం ప్రవేశపెట్టింది చాట్రాయి ఎంఈవో 2 వి ఎస్ వి బ్రహ్మాచారి

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటానికే ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం ప్రవేశపెట్టింది చాట్రాయి ఎంఈవో 2 వి ఎస్ వి బ్రహ్మాచారి
February 07, 2026 04:13 PM 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మండలంలోని ప్రాధమిక ప్రాధమికొన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి కార్యక్రమం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఎం ఈ ఓ బ్రహ్మా చారి మాట్లాడుతూ సమాజాన్ని పాఠశాల ను సమన్వయo చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. విద్యాంజలి యాప్ లో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సమాజం లోని వ్యక్తులు వాలంటీర్లు గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. విద్యాంజలి కార్యక్రమం ద్వారా ఆశక్తి కలిగిన వాలంటీర్లు అవసరం కల్గిన పాఠశాలలో వారి ఆసక్తి మేరకు విద్యా బోధన చేయవచ్చని వివరించారు. పాఠశాలలో అవసరమైన కనీసం సౌకర్యంలు దాతలు ఏర్పాటు చేయవచ్చన్నారు విద్యాంజలిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దేశ విదేశాలలో వున్న పాఠశాలల పూర్వ విద్యార్థులు వారి వారి పాఠశాలలలో అవసరమైన ఉపకారణాలు అందించటంతో పాటు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయం చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు సంఖ్య పెంచటానికి ఇప్పటికే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం లో ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్, శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్స్ గా సంజీవ కుమార్, ఎ వి. వెంకటేశ్వరరావు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సి ఆర్ పి లు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News