Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:26 AM

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటానికే ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం ప్రవేశపెట్టింది చాట్రాయి ఎంఈవో 2 వి ఎస్ వి బ్రహ్మాచారి

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటానికే ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం ప్రవేశపెట్టింది చాట్రాయి ఎంఈవో 2 వి ఎస్ వి బ్రహ్మాచారి

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటానికే ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం ప్రవేశపెట్టింది చాట్రాయి ఎంఈవో 2 వి ఎస్ వి బ్రహ్మాచారి
February 07, 2026 04:13 PM 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మండలంలోని ప్రాధమిక ప్రాధమికొన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి కార్యక్రమం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఎం ఈ ఓ బ్రహ్మా చారి మాట్లాడుతూ సమాజాన్ని పాఠశాల ను సమన్వయo చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. విద్యాంజలి యాప్ లో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సమాజం లోని వ్యక్తులు వాలంటీర్లు గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. విద్యాంజలి కార్యక్రమం ద్వారా ఆశక్తి కలిగిన వాలంటీర్లు అవసరం కల్గిన పాఠశాలలో వారి ఆసక్తి మేరకు విద్యా బోధన చేయవచ్చని వివరించారు. పాఠశాలలో అవసరమైన కనీసం సౌకర్యంలు దాతలు ఏర్పాటు చేయవచ్చన్నారు విద్యాంజలిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దేశ విదేశాలలో వున్న పాఠశాలల పూర్వ విద్యార్థులు వారి వారి పాఠశాలలలో అవసరమైన ఉపకారణాలు అందించటంతో పాటు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయం చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు సంఖ్య పెంచటానికి ఇప్పటికే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం లో ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్, శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్స్ గా సంజీవ కుమార్, ఎ వి. వెంకటేశ్వరరావు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సి ఆర్ పి లు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News