Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:21 PM

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటానికే ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం ప్రవేశపెట్టింది చాట్రాయి ఎంఈవో 2 వి ఎస్ వి బ్రహ్మాచారి

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటానికే ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం ప్రవేశపెట్టింది చాట్రాయి ఎంఈవో 2 వి ఎస్ వి బ్రహ్మాచారి

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటానికే ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమం ప్రవేశపెట్టింది చాట్రాయి ఎంఈవో 2 వి ఎస్ వి బ్రహ్మాచారి
February 07, 2026 04:13 PM 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మండలంలోని ప్రాధమిక ప్రాధమికొన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి కార్యక్రమం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఎం ఈ ఓ బ్రహ్మా చారి మాట్లాడుతూ సమాజాన్ని పాఠశాల ను సమన్వయo చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. విద్యాంజలి యాప్ లో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సమాజం లోని వ్యక్తులు వాలంటీర్లు గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. విద్యాంజలి కార్యక్రమం ద్వారా ఆశక్తి కలిగిన వాలంటీర్లు అవసరం కల్గిన పాఠశాలలో వారి ఆసక్తి మేరకు విద్యా బోధన చేయవచ్చని వివరించారు. పాఠశాలలో అవసరమైన కనీసం సౌకర్యంలు దాతలు ఏర్పాటు చేయవచ్చన్నారు విద్యాంజలిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దేశ విదేశాలలో వున్న పాఠశాలల పూర్వ విద్యార్థులు వారి వారి పాఠశాలలలో అవసరమైన ఉపకారణాలు అందించటంతో పాటు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయం చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు సంఖ్య పెంచటానికి ఇప్పటికే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం లో ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్, శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్స్ గా సంజీవ కుమార్, ఎ వి. వెంకటేశ్వరరావు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సి ఆర్ పి లు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News