ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: డీఎస్పీ మధుసూదన్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: డీఎస్పీ మధుసూదన్ రెడ్డి
K.RAVI
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ఇన్సూరెన్స్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు నిత్యం ధరించే దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డి.ఎస్.పి పటోళ్ల మధుసూదన్ రెడ్డి, ఎల్ఐసీ చౌటుప్పల్ శాఖ ఏబీఎం సత్యనారాయణ, భాస్కర్ రావు, అరుణ, పుర చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, మండల విద్యాధికారి ఎలికట్టె గురువారావు హాజరై విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి విద్యా బోధన అందుతుందని అన్నారు.ఏబీఎం సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పుర చైర్మన్ మోగుదాల పావని మాట్లాడుతూ దాతృత్వం లేనివారే నిజమైన పేదవారిగా భావించవచ్చని, సమాజంలో సహాయం చేసే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలని తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సహకారంతో పాఠశాలలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడడంతో పాటు పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణ శివకుమార్, కార్యక్రమ సమన్వయకర్త కూరెళ్ళ సత్యనారాయణ, భాస్కర్, నరసయ్య, రాంబాబు, నాగమణి, జానకి, హేమలత, మాధవరెడ్డి, భాగ్యశ్రీ, శ్రవణ్ కుమార్, జనార్దన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శోభ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి