ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
Editor Desk
రైతు వారంలో మత్స్యరంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
భువనగిరి :
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు వారము” కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో మత్స్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. చెరువుల అభివృద్ధి, చేప పిల్లల పంపిణీ, మత్స్యకారులకు ఆధునిక పరికరాల అందజేత, స్వయం ఉపాధి అవకాశాల కల్పన వంటి పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చేపల పెంపకం, మత్స్య సంపద అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతులు, మత్స్యకారులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని కోరారు. ప్రభుత్వ పథకాలపై గ్రామస్థాయిలో మరింత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారి రాజారామ్, సైంటిస్ట్ నాగరాజు, కో-ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటరెడ్డి, మత్స్యకార సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి