ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నారాయణ జూనియర్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నారాయణ జూనియర్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలి
Anjali
హిందూపురం పట్టణంలో నారాయణ జూనియర్ కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా PDSU విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బాబావలి AISF జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి NSUI జిల్లా ఉపాధ్యక్షులు భరత్ చంద్ర మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు మరియు ముందస్తు ప్రచారాలు అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ జూనియర్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కాలేజ్ ప్రారంభం నుంచి ఒకే ఒక ఎంపీసీ గ్రూప్ పెట్టి ఈ గ్రూపులో తల్లిదండ్రులకు ఆకర్షణమైన పేర్లు పెట్టి ఒక్కొక్కదానికి ఒక్క ఫీజు జేఈ మెయిన్స్ 45000 జెడ్ ఎఫ్ టి బి 52,000 కోర్స్ పార్క్ 65000 ఈ రకంగా నిర్ణయించి తల్లిదండ్రుల దగ్గర నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇవే కాకుండా ఇక్కడే పాఠ్యపుస్తకాలు మెటీరియల్ తీసుకోవాలని నిబంధన పెట్టి 8000 నుంచి 11,000 రూపాయలు వరకు అదనంగా వసూలు చేస్తున్నారు ఈ రకంగా ఫీజులు వసూలు చేస్తూ కనీసం విద్యార్థులకు క్రీడామైదానం పిఈటి సైకిల్ స్టాండ్ వంటివి మరియు విద్యార్థుల సంఖ్యకు సరిపడే మరుగుదొడ్లు కూడా లేవు ఈ రకంగా కనీస సౌకర్యాలు లేకుండా నడుపుతున్న నారాయణ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని వారన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కళాశాలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా విద్య అధికారి కార్యాలయం ముందు అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో PDSU AISF NSUI విద్యార్థి సంఘాల నాయకులు బద్రి నాగేంద్ర శివ అనుదీప్ చంద్ర నయీమ్ వెంకీ నాజీర్ కార్తీక్ లక్ష్మీపతి పవన్ వినీత్ మహేష్ ధనుష్ తేజ వలి యశ్వంత్ అరవింద్ వరుణ్ కళ్యాణ్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి