ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులకు సన్మానం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులకు సన్మానం
Editor Desk
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు నాలుగో రోజు ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని, తాము చదివిన విద్యాసంస్థను మరచిపోకుండా ప్రస్తుత విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
కార్యక్రమ ఇన్చార్జి డా. డి. కిషన్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తరచూ కళాశాలను సందర్శిస్తూ తమ పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ చూపాలని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంలో తల్లిదండ్రుల సూచనలు, సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు డా. జి. సునీత, డా. రాచమళ్ల శ్రీను, వైస్ ప్రిన్సిపాల్ డా. పి. వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు డా. తండు కృష్ణ కౌండిన్య, ఎం. అనిత, డా. ఎం. రవీందర్ రావు, టి. శ్రీనివాస్, జె. నరేశ్, రవి, కార్యాలయ సిబ్బంది ఫయాజ్, షరీఫ్, శ్రీదేవి, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి