Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం సీఎం, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో సభా వేదిక, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 12, 2026 10:08 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నర్సుల దినోత్సవం. సేవాభావమే నర్సింగ్‌ వృత్తికి గుర్తింపు: డీసీహెచ్‌ మాతృనాయక్‌

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నర్సుల దినోత్సవం. సేవాభావమే నర్సింగ్‌ వృత్తికి గుర్తింపు: డీసీహెచ్‌ మాతృనాయక్‌

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నర్సుల దినోత్సవం. సేవాభావమే నర్సింగ్‌ వృత్తికి గుర్తింపు: డీసీహెచ్‌ మాతృనాయక్‌
May 12, 2026 08:59 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక జీజీహెచ్‌లో నిర్వహించిన కార్యక్రమం నర్సింగ్‌ సూపరింటెండెంట్లు నీలిబాయి, సుజాత, రేణుకాదేవి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో సేవలందిస్తున్న నర్సులను ఒకే వేదికపై పరిచయం చేసి, వారి సేవలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలు, కేక్‌ కటింగ్‌తో వేడుకలు నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన నర్సులను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న డీసీహెచ్‌ మాతృనాయక్‌ మాట్లాడుతూ.. నర్సింగ్‌ వృత్తి సేవాభావానికి ప్రతీక అని అన్నారు. రోగులను కుటుంబ సభ్యుల్లా భావిస్తూ నర్సులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

సమాజంలో నర్సులకు ప్రత్యేక స్థానం ఉందని, రోగులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ సేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ఎం చంద్రశేఖర్‌, స్టాఫ్‌నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News