ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నర్సుల దినోత్సవం. సేవాభావమే నర్సింగ్ వృత్తికి గుర్తింపు: డీసీహెచ్ మాతృనాయక్
ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నర్సుల దినోత్సవం. సేవాభావమే నర్సింగ్ వృత్తికి గుర్తింపు: డీసీహెచ్ మాతృనాయక్
Editor Desk
నల్లగొండ: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక జీజీహెచ్లో నిర్వహించిన కార్యక్రమం నర్సింగ్ సూపరింటెండెంట్లు నీలిబాయి, సుజాత, రేణుకాదేవి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో సేవలందిస్తున్న నర్సులను ఒకే వేదికపై పరిచయం చేసి, వారి సేవలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలు, కేక్ కటింగ్తో వేడుకలు నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన నర్సులను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న డీసీహెచ్ మాతృనాయక్ మాట్లాడుతూ.. నర్సింగ్ వృత్తి సేవాభావానికి ప్రతీక అని అన్నారు. రోగులను కుటుంబ సభ్యుల్లా భావిస్తూ నర్సులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
సమాజంలో నర్సులకు ప్రత్యేక స్థానం ఉందని, రోగులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ సేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సీఎస్ఆర్ఎం చంద్రశేఖర్, స్టాఫ్నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి