ప్రభుత్వ ఉపాధ్యాయులు రచించినటువంటి కనువిప్పు-శంఖారావం ఆవిష్కరణ
ప్రభుత్వ ఉపాధ్యాయులు రచించినటువంటి కనువిప్పు-శంఖారావం ఆవిష్కరణ
Sthanikam District Staff Reporter
లెక్కల మల్లారెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగస్తుల భవనంలో లెక్కల మల్లారెడ్డి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు రచించినటువంటి కనువిప్పు-శంఖారావం అను రెండు దృశ్య కావ్యాలను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి డాక్టర్ పోరేటి రంగయ్య సభ అధ్యక్షత వహించారు.జన్వాడ రామస్వామి ప్రముఖ కవి రిటైర్డ్ ప్రిన్సిపల్ హాజరై ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా బండారు జయశ్రీ జిల్లా రచయితల సంఘం కార్యదర్శి,శెట్టి బాలయ్య యాదవ్,కె.మోహన్ రెడ్డి,జిల్లా పెన్షనర్స్ అధ్యక్షులు పాల్గొని వారు మాట్లాడుతూ...వరకట్నానికి వ్యతిరేకంగా ఇతివృత్తంగా తీసుకొని కనువిప్పు మరియు దేశ రక్షణలో యువకుల పాత్రను ఇతివృత్తంగా తీసుకొని శంఖారావం అనే నాటకాలను రచించి అలనాడు1970 సంవత్సరంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో నిర్వహించిన పోటీలలో మరియు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించి ప్రథమ బహుమతి అందుకున్న కనువిప్పు నాటక నాటి బాల నటులు డాక్టర్ వల్లాల అమరేందర్,కోక్కలకొండ నిమ్మయ్య,మెరుగు దేవరాజు ఆ నాటకమును ముద్రించి ఆదివారం రోజు పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. ఈ రెండు డాక్టర్ జన్వాడ రామస్వామి ఆవిష్కరిస్తూ...గ్రంథ సమీక్ష నిర్వహించిన ఆయనను అనంతరం ఈ పుస్తకాల రచయిత లెక్కల మల్లారెడ్డిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, భువనగిరి పీస్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొక్కలకొండ నిమ్మయ్య, డాక్టర్ వల్లలా అమరేందర్,పిలుపు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జనార్ధన్,రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి జ్ఞాన ప్రకాశ్ రెడ్డి,బండారు శ్రీనివాస్,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి