Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:53 AM

ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం

ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం

ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం
January 03, 2026 01:56 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానిక ప్రతినిధి

ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యాపకులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలిగా ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ రోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు.

కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ మాలె వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో మహిళలకు విద్య ద్వారా వెలుగు చూపిన సావిత్రిబాయి పూలే కృషి అనన్యసాధ్యమని అన్నారు. విద్యే సామాజిక మార్పుకు బలమైన ఆయుధమని ఆమె జీవితం నిరూపించిందని విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పున్నారావు, మందడి వెంకట్ రెడ్డి, కిరణ్, నరసింహారావు, అశోక్, నగేష్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జానయ్య, వెంకటేశ్వరరావు, శ్రవణ్, పరశురాములు, నిర్మల, కవిత, రాజేశ్వరి, ఉమారాణి, కరుణ, నాగమణి, పుష్పలత తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News