ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం
ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి
ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యాపకులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలిగా ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ రోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు.
కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ మాలె వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో మహిళలకు విద్య ద్వారా వెలుగు చూపిన సావిత్రిబాయి పూలే కృషి అనన్యసాధ్యమని అన్నారు. విద్యే సామాజిక మార్పుకు బలమైన ఆయుధమని ఆమె జీవితం నిరూపించిందని విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పున్నారావు, మందడి వెంకట్ రెడ్డి, కిరణ్, నరసింహారావు, అశోక్, నగేష్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జానయ్య, వెంకటేశ్వరరావు, శ్రవణ్, పరశురాములు, నిర్మల, కవిత, రాజేశ్వరి, ఉమారాణి, కరుణ, నాగమణి, పుష్పలత తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి