పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణ
పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణ
స్థానికం బృందం
పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణ
స్థానిక ప్రతినిధి:
మూడో తుదివిడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్, మంచాల మండలం అఘపల్లి గ్రామంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాచకొండ పరిధిలోని భువనగిరి కమిషనరేట్లో గుండాల, మోటకొండూరు, చౌటుప్పల్, నారాయణపూర్, మోత్కూర్, అడ్డగూడూరు, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల్, గ్రీన్ ఫార్మా, మాడ్గుల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో 163 బీఎన్ఎస్ (144 సెక్షన్) అమల్లోకి తెచ్చినట్లు సీపీ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో నలుగురికి మించి గుమిగూడరాదని స్పష్టం చేశారు.
పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ పూర్తై ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న ఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని ఆదేశించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి