Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:41 AM

పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణ

పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణ

పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణ
December 17, 2025 07:03 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణ

స్థానిక ప్రతినిధి:

మూడో తుదివిడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్, మంచాల మండలం అఘపల్లి గ్రామంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాచకొండ పరిధిలోని భువనగిరి కమిషనరేట్‌లో గుండాల, మోటకొండూరు, చౌటుప్పల్, నారాయణపూర్, మోత్కూర్, అడ్డగూడూరు, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల్, గ్రీన్ ఫార్మా, మాడ్గుల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో 163 బీఎన్‌ఎస్ (144 సెక్షన్) అమల్లోకి తెచ్చినట్లు సీపీ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో నలుగురికి మించి గుమిగూడరాదని స్పష్టం చేశారు.

పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ పూర్తై ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న ఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News