పొగమంచుతో ప్రమాద ముప్పు – రామన్నపేటలో వాహనదారులకు పోలీసుల హెచ్చరిక ఎస్ ఐ డి నాగరాజు
పొగమంచుతో ప్రమాద ముప్పు – రామన్నపేటలో వాహనదారులకు పోలీసుల హెచ్చరిక ఎస్ ఐ డి నాగరాజు
Editor Desk
పొగమంచు ముప్పు.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి
రామన్నపేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండలంలో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు తీవ్రంగా కమ్ముకుంటుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు, పాదచారులు స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంటుండటంతో అతివేగం, ఓవర్టేకింగ్ అత్యంత ప్రమాదకరమని సూచించారు. హై బీమ్ లైట్లు వినియోగించకుండా లో బీమ్ లేదా ఫాగ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలని, ముందున్న వాహనానికి తగినంత దూరం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
లేన్ క్రమశిక్షణ పాటించకపోతే ప్రమాదాలు తప్పవని, పొగమంచు తీవ్రంగా ఉన్న సమయంలో వాహనాన్ని పక్కకు నిలిపి పరిస్థితి మెరుగయ్యాకనే ప్రయాణం కొనసాగించాలన్నారు. సడన్ బ్రేకింగ్ వల్ల వాహనం స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున నెమ్మదిగా బ్రేక్ వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
చలికాలంలో రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ అని గుర్తు చేస్తూ, ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రామన్నపేట మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ డి. నాగరాజు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి