PRINT TIME: July 04, 2026 01:54 AM
పనివారి వివరాలు పోలీసులకు ఇవ్వాలి: సీఐ మన్మధకుమార్
పనివారి వివరాలు పోలీసులకు ఇవ్వాలి: సీఐ మన్మధకుమార్
May 15, 2026 11:07 AM
135 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
ఇళ్లలో పనులు చేసే మనుషులు, వాచ్మెన్లు, కేర్టేకర్లు వంటి వారి పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేయించాలని చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్తగా పనిలోకి తీసుకునే వ్యక్తుల ఆధార్, ఫోన్ నంబర్ తదితర వివరాలు తప్పనిసరిగా సేకరించాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.డయల్ 100 లేదా 112కు ఫోన్ చేసి ఎప్పుడైనా సహాయం పొందవచ్చని సీఐ తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి