పనసం అంజయ్య గౌడ్కు కన్నీటి నివాళి
పనసం అంజయ్య గౌడ్కు కన్నీటి నివాళి
Editor Desk
రామన్నపేట: రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన పనసం అంజయ్య గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు, గ్రామస్తులు అంజయ్య గౌడ్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోశబోయిన మల్లేష్ యాదవ్, జనంపల్లి ఉపసర్పంచ్ చొప్పరి నరసింహ, బోగారం ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, బంజారాహిల్స్ సీఐ నందగిరి వెంకటేశ్వర్లు, కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కూనూరు మల్లేష్ గౌడ్, తెలుసురి మల్లేష్ యాదవ్, మేడి కృష్ణ, కూనూరు రాజు, పంజాల నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి