Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:06 AM

పనసం అంజయ్య గౌడ్‌కు కన్నీటి నివాళి

పనసం అంజయ్య గౌడ్‌కు కన్నీటి నివాళి

పనసం అంజయ్య గౌడ్‌కు కన్నీటి నివాళి
15-05-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన పనసం అంజయ్య గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు, గ్రామస్తులు అంజయ్య గౌడ్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోశబోయిన మల్లేష్ యాదవ్, జనంపల్లి ఉపసర్పంచ్ చొప్పరి నరసింహ, బోగారం ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, బంజారాహిల్స్ సీఐ నందగిరి వెంకటేశ్వర్లు, కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కూనూరు మల్లేష్ గౌడ్, తెలుసురి మల్లేష్ యాదవ్, మేడి కృష్ణ, కూనూరు రాజు, పంజాల నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పనసం అంజయ్య గౌడ్‌కు కన్నీటి నివాళి

Article Image

రామన్నపేట: రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన పనసం అంజయ్య గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు, గ్రామస్తులు అంజయ్య గౌడ్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోశబోయిన మల్లేష్ యాదవ్, జనంపల్లి ఉపసర్పంచ్ చొప్పరి నరసింహ, బోగారం ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, బంజారాహిల్స్ సీఐ నందగిరి వెంకటేశ్వర్లు, కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కూనూరు మల్లేష్ గౌడ్, తెలుసురి మల్లేష్ యాదవ్, మేడి కృష్ణ, కూనూరు రాజు, పంజాల నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News