పంచాయతీ ఎన్నికల్లో బీసీల ఆధిపత్యం – చిట్యాల మండలం
పంచాయతీ ఎన్నికల్లో బీసీల ఆధిపత్యం – చిట్యాల మండలం
Editor Desk
చిట్యాల మండలంలో బీసీ సర్పంచ్ల ‘హవా’
చిట్యాల – స్థానిక ప్రతినిధి
చిట్యాల మండల రాజకీయ గడ్డపై ఈసారి బీసీ వర్గాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక వెలువడిన ఫలితాలు చూస్తే… “బీసీల హవా” అన్న మాటకు పూర్తి న్యాయం జరిగిందనిపిస్తోంది.
మొత్తం 18 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 6, ఎస్సీలకు 3, అర్రిజర్వుడు (జనరల్)కు 9 స్థానాలు కేటాయించారు. అయితే ఇక్కడే కథ మలుపు తిరిగింది. కేవలం తమకు కేటాయించిన స్థానాలకే పరిమితం కాకుండా… జనరల్ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చి, రాజకీయ చాణక్యంతో విజయాన్ని తమ వైపు తిప్పుకున్నారు.
ఫలితంగా మండలంలో మొత్తం 13 మంది బీసీలు సర్పంచులుగా ఎన్నికై స్థానిక రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని ఘనంగా చాటుకున్నారు. ఇది కేవలం సంఖ్యల గెలుపు కాదు… గ్రామస్థాయిలో బీసీ వర్గాలపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి అద్దం పట్టిన తీర్పుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచే బీసీ అభ్యర్థులు ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టారు. రహదారులు, తాగునీరు, ఉపాధి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రధాన అజెండాగా మార్చుకుని ఇంటింటా చేరుకున్నారు. అదే సమయంలో యువత, మహిళలు, రైతులను కలుపుకుని విస్తృత మద్దతు కూడగట్టగలిగారు.
చిట్యాల మండలంలో ఈ ఫలితాలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇకపై గ్రామ పాలనలో బీసీల పాత్ర మరింత బలపడనుంది. మండల రాజకీయాల దిశ, దశను మార్చే శక్తి తమ వద్ద ఉందని ఈ ఎన్నికల ద్వారా బీసీ సర్పంచులు నిరూపించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి