పోలీస్ నరేందర్ కన్నుమూత
పోలీస్ నరేందర్ కన్నుమూత
Krishna
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి ఓడిన పోలీస్ నరేందర్ ఖేడ్ ప్రాంతానికి చేసిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివని ప్రజలు భావోద్వేగంగా గుర్తు చేసుకుంటున్నారు. ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు విడదీయరాని బంధంగా నిలిచాయని స్థానికులు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆయన అవయవాలను దానం చేయడంతో మరికొందరికి కొత్త జీవితం లభించనుంది.
నరేందర్ మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు రేపు సిద్ధిపేటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
నరేందర్ సేవలను గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అభిమానులు, స్థానికులు ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి