పల్లె గ్రామ అభివృద్ధికి మంత్రి సీతక్కకు వినతిపత్రం
పల్లె గ్రామ అభివృద్ధికి మంత్రి సీతక్కకు వినతిపత్రం
Krishna
ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ :ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో, మండలంలోని పల్లె (హరిపూర్) గ్రామ సర్పంచ్ సంజీవ్ పార్దేమ్ బుధవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటు అయిన పల్లె గ్రామ పంచాయతీ అభివృద్ధి దిశగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మంత్రి గారికి వినతిపత్రం అందజేశారు. గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం, స్మశాన వాటిక, అంగన్వాడి భవనం, అలాగే గ్రామ పారిశుధ్య నిర్వహణకు ఉపయోగపడే ట్రాక్టర్ మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు రామ్ సన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి